34
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భూ పరిశీలన ఉపగ్రహాన్ని గగనతలంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, SSLV సహాయంతో ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంటల 17 నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. ఇస్రో అభివృద్ధి చేసిన ఈ SSLV, 500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 500 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకెళ్ళే సామర్థ్యం కలిగి ఉంది. తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయబడే ఈ వాహక నౌక సహాయంతో బహుళ సూక్ష్మ ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు.