ఏ కూతురుకైనా నాన్నే హీరో. అలాంటి నాన్న ప్రాణాలకే ముప్పు ఏర్పడితే.. ఆమె ఎంతకైనా తెగిస్తుంది. గొడ్డలి చేతబూని ‘షీరో’ అవుతుంది. ఛత్తీస్గఢ్లో చోటుచేసుకున్న అచ్చం ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రిని చంపేందుకు వచ్చిన మావోయిస్టులను ధైర్యంగా ఎదుర్కొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా ఝురాగావ్లో నివసిస్తున్న సోమధర్ కోరం పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, అతన్ని హతమార్చేందుకు మావోయిస్టులు నిర్ణయించారు. సోమవారం రాత్రి 8 మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి ఇంటి వద్ద ఉన్న సోమధర్పై ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. అక్కడే ఉన్న ఆయన కుమార్తె సులీల వారిని ప్రతిఘటించింది. దాడి చేస్తున్న ఓ వ్యక్తి చేతిలోని గొడ్డలిని లాక్కొని పెడబొబ్బలు పెడుతూ శివంగిలా ఎదురు దాడి చేసింది. దీంతో స్థానికులు పరుగున చేరుకోవడంతో భయపడిన మావోయిస్టులు వెళ్లిపోయారు. సోమధర్ మెడపై గొడ్డలి గాయం కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన తండ్రి ప్రాణాలను కాపాడుకునేందుకు సులీల చేసిన ధైర్యాన్ని స్థానికులు కొనియాడారు.
53
You Might Also Like
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
16
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
28
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...
అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు
21
ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్...
సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్
26
సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం...
ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
26
తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి...