News

మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ..

72views

అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలో మావోయిస్టులు వారోత్సవాలకు వ్యతిరేకంగా మంగళవారం జిమాడుగుల వారపు సంతలో ప్రజలు, కాలేజీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

మావోయిస్టులు వల్ల గిరిజనుల అభివృద్ధి కుంటిపడుతుందని కావున మీరు మా అభివృద్ధి గురించి ఆలోచిస్తే మాకు రోడ్లు గురించి రవాణా సౌకర్యం గురించి కమ్యూనికేషన్ గురించి మంచినీటి సౌకర్యం కొరకు మీరు మాకు సహకరించాలి గానీ అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పుడు దానికి అడ్డుగా నిలవకూడదని హితవు పలికారు.

అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నప్పుడు రోడ్లు వేస్తున్న వారిని కాంట్రాక్టర్లను, కమ్యూనికేషన్ వ్యవస్థను, సెల్ టవర్లను మీరు ధ్వంసం చేయడం సరికాదని తెలుపుతూ ఈ ర్యాలీ ద్వారా మావోయిస్టులు తెలియజేస్తున్నామని వారు పేర్కొన్నారు.