News

శాకాహారికి మాంసాహారం వడ్డన

42views

వందేభారత్‌ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్‌డా నుంచి రాంచీకి వందేభారత్‌ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్‌ చేశాడు. అయితే ఒక వెయిటర్‌ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్‌-వెజ్‌ భోజనం అని గుర్తించాడు.

శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది.‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది.