News

హరోహర భక్తజనసంద్రమైన గుడివంక

41views

చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం గుడివెంకలో ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి కావళ్ళు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హరో హర మురగయ్య నాముస్కరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. స్వామి అమ్మవార్లకు చేరువ జామునే అభిషేకాలు నిర్వహించిన ప్రధాన అర్చకులు వీరశేఖరయ్య, ప్రత్యేక అలంకరణలు చేశారు. ఆదివారం రాత్రే గుడివెంక చేరుకున్న భక్తులకు ఉపయం నుంచే స్వామి దర్శనం కల్పించారు. పాలకావడి తేరుకావడి నెమలికాతో పాటు నోటికి, వీపునకు ఇనుప శూలం గుచ్చుకుని పులు వాయిద్యాలు భక్తిపాటలతో భక్తులు గుడివంక మీదుగా వేసమాను కొండెక్కి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు.