News

వైభవంగా వెండి రథోత్సవం

46views

శ్రీశైల క్షేత్రంలో సోమవారాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు సాయంత్రం సహస్ర దీపాలం కరణ సేవను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛ రణలతో పూజలు చేశారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహిం చారు. తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి రథంపై అశీనులనుజేసి ప్రత్యేక పూజలు, మంగళ హారతులు ఇచ్చి ఆలయ ప్రాంగణంలో రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.