News

చెంచు గిరిజనులను ప్రశంసించిన ప్రధాని

44views

ఆంధ్రప్రదేశ్‌ లోని చెంచు గిరిజనులు పులుల సంరక్షణకు కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోది పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నల్లమల కొండలపై నివసించే చెంచు తెగ గురించి ప్రస్తావించారు. పులుల సంరక్షణకు చెంచు గిరిజనులు టైగర్ ట్రాకర్లుగా, అడవిలో వన్యప్రాణుల సంచారం గురించి ప్రతి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెట్టి అధికారులకు సమాచారం అందిస్తూ అటవీ సంరక్షణకు తోడ్పాటును అందిస్తున్నారని ప్రశంసించారు.