News

భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలు

77views

ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు మరింత సౌకర్యంగా, స్నేహపూర్వకంగా అందేలా చూస్తామని నూతన అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్యచౌదరి తెలిపారు. శనివారం అదనపు ఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, జేఈఓ వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందించారు. అనంతరం వెంకయ్యచౌదరి మాట్లాడుతూ ఈ బాధ్యతలు శ్రీవారి ఆశీస్సులతో దక్కాయని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ‘భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయసేకరణ కీలకం. దేవస్థానంలోని అన్ని విభాగాల సమన్వయంతో వారికి అంకితభావంతో మెరుగైన సేవలందించడంపై దృష్టి పెడతాం. ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కృషి చేస్తామ’ని చెప్పారు. అనంతరం గోకులం అతిథిగృహంలో టీటీడీ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.