ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు మరింత సౌకర్యంగా, స్నేహపూర్వకంగా అందేలా చూస్తామని నూతన అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్యచౌదరి తెలిపారు. శనివారం అదనపు ఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం, జేఈఓ వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందించారు. అనంతరం వెంకయ్యచౌదరి మాట్లాడుతూ ఈ బాధ్యతలు శ్రీవారి ఆశీస్సులతో దక్కాయని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ‘భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయసేకరణ కీలకం. దేవస్థానంలోని అన్ని విభాగాల సమన్వయంతో వారికి అంకితభావంతో మెరుగైన సేవలందించడంపై దృష్టి పెడతాం. ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కృషి చేస్తామ’ని చెప్పారు. అనంతరం గోకులం అతిథిగృహంలో టీటీడీ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.
77
You Might Also Like
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
21
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. 5000 మందితో బందోబస్తు
12
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి 12 వరకు కొనసాగనున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద...
శతకోటి సూర్యులను తలదన్నే… ప్లాస్మా ప్రవాహాలు
24
ఇదేమిటో తెలుసా? మన ఊహకు కూడా అందనంత పెద్దదైన బ్లాక్హోల్ నుంచి దూసుకొస్తున్న రెండు భారీ ప్లాస్మా ప్రవాహాల్లో (బ్లాక్హోల్ జెట్) ఒకటి. ఇప్పటిదాకా గుర్తించిన వాటిలో...
హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు
20
హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ - కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల...
చైనాలో తినేవాటికి భారత్లో పూజలంటూ సనాతనధర్మంపై సీపీఎం అవహేళన
29
హిందువులపై, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సీపీఎం నేత కేపీ ఉదయభాను వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆరాధన సంప్రదాయాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
హిజ్బుత్ తహ్రీర్ కేసు: తమిళనాట 11చోట్ల ఎన్ఐఎ సోదాలు
26
‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ అతివాద ఇస్లామిక్ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ మంగళవారం నాడు తమిళనాడులోని 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. భారత్ను ముస్లిందేశంగా...