News

తీర్థాల నెలవు.. కో’నీరు’ కరవు

42views

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరువయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ వద్ద ఆపరిశుభ్రత నెలకొంది. పారి పట్టడంతో భక్తులు స్నానాలకు ముందుకు రావడం లేదు. గంగాభవాని స్నానాల ఘాట్ పక్కనే దేవస్థానం అధికారులు కోనేరు అభివృద్ది చేశారు. మహాశివరాత్రి ఉగాది కార్తికమాసం దసరా నవరాత్రులకు తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కోనేరులో నిత్యం భక్తులు స్నానాలు చేసేందుకు అనుమతులు ఇస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి అక్కడే భక్తులు స్నానాలు వేయాలంటే రూ.50 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.