అనంతపురం జిల్లాలోని చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ కోట ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. కట్టడాలు, కోనేరు, ప్రాకారాలు, బురుజులు, రక్షణ కోసం నిర్మించిన పొడవాటి గోడ, గుర్రపు, గజశాలలకు వేటికవే ప్రత్యేకం. నిర్వహణపై అలసత్వం కారణంగా రక్షణ గోడలు శిదిలమవుతున్నాయి. ప్రాకారాలు, బురుజులు నేడు కళావిహీనంగా మారిపోయాయి. పర్యాటకులు సైతం అంతంతమాత్రంగానే వస్తున్నారు. కోటపై భాగానికి చేరుకోవాలంటే 3 గంటల సమయం పడుతోంది. ఆసక్తితో పర్యాటకులు ఎక్కే ప్రయత్నం చేసినా వెళ్లే దారిలో మౌలిక వసతులు లేక నిట్టూర్చుతున్నారు. గతంలో రోప్వే వేసే ప్రణాళికలు వేసినా అవి కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో చారిత్రక, ప్రాచీన ప్రాశస్త్యం ఉన్న కట్టడాలను, ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే దిశగా కలెక్టర్ వినోద్ కుమార్ సంబందిత శాఖలకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. టూరిస్ట్ హబ్ మార్చే దిశగా వేసే అడుగుల్లో భాగంగా గుత్తికోటను అభివృద్ధి చేస్తే.. పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది.
42
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
46
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
49
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
55
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
37
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...