News

టీటీడీ నిత్య అన్నదాన కూరగాయల వాహనాన్ని ప్రారంభించిన మంత్రి

43views

సమాజంలో వివిధ వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న ఆరాధనతో సమానమైన సంతృప్తి లక్షలాది మందికి అన్న ప్రసాదం అందిస్తున్న స్వామివారి నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు అందించడంలో కూడా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు అన్నారు. రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కరెన్సీ నగర్ లోని క్యాంపు కార్యాలయం వద్ద నుంచి బయలుదేరిన వాహనానికి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై దేవ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవించేలా వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు పొందేలా సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పనిలోనూ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయన్నారు.