News

శాకంబరిగా తలుపులమ్మతల్లి

42views

కాకినాడ జిల్లా తునిలోని లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాసం మూడో ఆదివారం వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి విశేష అలంకరణ చేసినట్టు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్‌, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. అమలాపురానికి చెందిన భక్తుడు అర్లపల్లి శివ మూడు టన్నుల కూరగాయలు బహూకరించగా మరో రెండు టన్నుల కూరగాయలను దేవస్థానం కొనుగోలు చేసినట్టు ఈఓ తెలిపారు. ప్రధాన గర్భాలయంలో అమ్మవారికి, పంచలోహ విగ్రహాల అమ్మవారికి, ఆలయాన్ని కూరగాయలతో అలంకరించామన్నారు. వేలాది మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పులిహోర ప్రసాదం భక్తులకు ఉచితంగా అందించినట్టు ఈఓ తెలిపారు