తిరుమలలో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను టీటీడీ కుదించింది. శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా 22వ తేదీ నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వెయ్యికే పరిమితం చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు కొద్దిరోజులు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎలాంటి పరిమితి లేకుండా శ్రీవాణిటికెట్లను జారీ చేస్తూ వచ్చారు. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో రోజుకు 2 వేల వరకు టికెట్ల కేటాయింపు జరిగింది. అయితే ప్రస్తుతం రద్దీ పెరుగుతున్న క్రమంలో ఆన్లైన్లో 500తో పాటు ఆఫ్లైన్లో మరో వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో 900 టికెట్లను తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో మొదటవచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు. ఇక, మరో వంద టికెట్లను రేణిగుంటలోని విమానాశ్రయంలో కేటాయిస్తారు. బోర్డింగ్ పాస్ ద్వారా వీటిని భక్తులు పొందవచ్చు.
47
You Might Also Like
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య
36
అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...
మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి
34
మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది....
దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా
50
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని...
భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – అదనపు ఈవో
28
టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల...
రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు
24
రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...
హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి
40
తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని...