News

ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర

43views

పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఐఆర్్సటీసీ సంస్థ సప్తజ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు నడపనుంది. ఆగస్టు 17న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా నడిచే ఈ రైలు ఉజ్జయిని(మహాకాళేశ్వర్,ఓంకాళేశ్వర్), ద్వారక (నాగేశ్వర్),సోమనాథ్, పుణె (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగ బాద్(గ్రీష్టేశ్వర్) తదితర ప్రాంతాలను సందర్శించి 28న తిరుగు ప్రయాణమవుతోంది. అల్పాహారం, టీ, భోజనం, రవాణా, వసతితో కలిపి టికెటు ధర ఒక్కొక్కరికీ స్లీపర్ తరగతిలో రూ.20,590, థర్డ్ ఏసీలో రూ.33,015,సెకండ్ ఏసీలో రూ.43,355 ఉంటుంది. టికెట్ల బుకింగ్
ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్లు 9281030714,9281495848లో సంప్రదించవచ్చు.