News

హిందూ పిల్లల టీసీల్లో క్రిస్టియన్లుగా రాస్తున్న స్కూల్ యాజమాన్యం…

53views

మధ్యప్రదేశ్‌లోని గుడ్‌ షెపర్డ్‌ పాఠశాలలో పాఠశాల బదిలీ సర్టిఫికేట్‌ (TC)లో తమ మతాన్ని మార్చేశారంటూ హిందూ కుటుంబం ఆరోపించింది. ఈ మేరకు బాలల హక్కుల పరిరక్షణ మిషన్‌లో విద్యార్థినుల తలిదండ్రులు ఫిర్యాదు చేశారు. తాము హిందువులమని, కానీ.. తమ పిల్లల టీసీపై పాఠశాల యాజమాన్యం క్రిస్టియానిటీ అని రాసిందని పేర్కొన్నారు. ఈ తప్పిదం వల్ల తమ పిల్లలను మరో కొత్త పాఠశాలలో చేర్పించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తాము బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థి తలిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును కమిషన్‌ స్వీకరించింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌కి లేఖ రాసింది.