ఆంధ్రప్రదేశ్లోని పలు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇన్ఛార్జి వైస్ఛాన్స్లర్లను నియమించారు. ఎస్వీయూ ఇన్ఛార్జి వీసీగా చిప్పాడ అప్పారావు, ఎస్కేయూ(SKU) ఇన్ఛార్జి వీసీగా బి. అనిత, ఏయూ ఇన్ఛార్జి వీసీగా గొట్టపు శశిభూషణ్రావు, నాగార్జున వర్సిటీ వీసీగా కంచర్ల గంగాధర్, జేఎన్టీయూ అనంతపురం ఇన్ఛార్జి వీసీగా సుదర్శనరావు, పద్మావతి మహిళా వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా వి.ఉమను నియమించారు.
జేఎన్టీయూ విజయనగరం ఇన్ఛార్జి వీసీగా రాజ్యలక్ష్మి, జేఎన్టీయూ కాకినాడ ఇన్ఛార్జి వీసీగా మురళీకృష్ణ, నన్నయ వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా వై. శ్రీనివాసరావు, విక్రమ సింహపురి వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా సారంగం విజయభాస్కర్రావును ప్రభుత్వం నియమించింది.
కృష్ణా వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా ఆర్ శ్రీనివాస్రావు, రాయలసీమ వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా ఎన్టీకే నాయక్, ద్రవిడ వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా ఎం. దొరస్వామిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్కిటెక్చర్ ఫైన్ఆర్ట్స్ వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా విశ్శనాథకుమార్, ఒంగోలులోని ఆంధ్రకేసరి వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా డీవీఆర్ మూర్తి, అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ ఇన్ఛార్జి వీసీగా పఠాన్ షేక్ ఖాన్ను నియమించారు.