గురు నానక్ తన శిష్యుడు మర్దానాతో కలిసి దేశ సంచారం చేస్తున్నారు. మర్దానా ఒకసారి సమీపంలోని గ్రామానికి వెళ్లాడు. అక్కడి ప్రజలు అతణ్ని గొప్ప దైవభక్తుడిగా భావించి ఆశీర్వాదం తీసుకున్నారు. రకరకాలైన తినుబండారాలతో పాటు పట్టు, నూలు, ఉన్ని దుస్తులు, అత్తరులు కానుకగా ఇచ్చారు. వాటిని మూటగట్టుకొని మర్దానా ఆనందంగా గురువు దగ్గరికి వచ్చాడు. తన ఆజ్ఞను అతిక్రమించి అలాంటి వాటిని తెచ్చినందుకు గురు నానక్ ఆగ్రహించారు. వాటిని పారవేయాలని ఆజ్ఞాపించారు. మర్దానా గురువు చెప్పినట్లే చేశాడు. దానం విషయంలో అతడికో సందేహం వచ్చింది. ‘ఆర్తులకు ఎవరైనా దానం చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడా?’ అని మర్దానా ప్రశ్నించాడు. ‘ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం, ఒంటి మీద సరైన దుస్తులు లేనివారికి వస్త్రాలు అందించడం వల్ల దాతకు భగవంతుడి ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. అయితే, ఆ దానం తాను కష్టపడి సంపాదించిన దానినుంచే చేయాలి. దానాన్ని స్వీకరించే వ్యక్తీ తనకు అవసరమైనంతే తీసుకోవాలి’ అని గురు నానక్ బదులిచ్చారు.
58
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
32
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
25
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
32
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
14
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
27
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
38
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...