మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజశాల–కమల్ మౌలా మసీదు సముదాయం కింద 94కిపైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ) తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్ జైన్ తెలిపారు. అక్కడ హిందూ ఆలయం ఉందనడానికి ఇదే నిదర్శనమని.. అక్కడ హిందూ పూజలు మాత్రమే నిర్వహించాలని సోమవారమిక్కడ తెలిపారు. వివాదాస్పద కట్టడంపై శాస్త్రీయ సర్వే నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ నెల 4న ఇచ్చిన ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే పూర్తిచేసింది. దాని తరఫు న్యాయవాది హిమాంశు జోషీ సోమవారం 2,000 పేజీల తన రిపోర్టును కోర్టుకు అందజేశారు. 22న దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుందని తెలిపారు. ధార్ జిల్లాలో 11వ శతాబ్దికి చెందిన ఈ భోజశాలను వాగ్దేవి (సరస్వతీదేవి) ఆలయంగా హిందువులు విశ్వసిస్తారు. ఇది కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. 2003 ఏప్రిల్ 7న ఏఎస్ ఐ.. భోజశాలలో ప్రతి మంగళవారం హిందువులు పూజ చేసుకోవడానికి, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనిని వ్యతిరేకించిన ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ సంస్థ శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది .కాగా, శాస్త్రీయ సర్వే జరపాలన్న హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మౌలానా కమాలుద్దీన్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.
79
You Might Also Like
అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ
పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ...
జాతీయ నిర్దేశకులు పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన...
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
52
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
34
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
48
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...