యజ్ఞయాగాది క్రతువుల్లో లోకకల్యాణం దాగి ఉంది. ఆలయాల్లో ప్రతిష్ఠించిన దేవుళ్ల విగ్రహాలు సామాన్యమైనవి కావు. ఆ ప్రతిమల్లో ఆయా దేవుళ్ల విశ్వకారక దివ్యశక్తి నిబిడీకృతమై ఉంది. ఆ భావనతో మంత్రయుక్త విగ్రహాన్ని అభిషేకిస్తే అది విశ్వానికి పుష్టినిస్తుంది. అదే విధంగా హోమగుండాల్లో సమిధలుగా వేయటం కూడా విశ్వకల్యాణం కోసమే. భగవంతుడికి ఏది సమర్పిస్తే అది వేయింతలుగా తిరిగి వస్తుంది. వేళ్లకు నీళ్లు పోస్తే చెట్టంతా పుష్టిగా ఎదిగినట్లు, సృష్టికి మూలకారకుడైన ఆ పరమాత్మకు అర్పించిన ఫలంగా జగమంతా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. జనావళికి సమస్త దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు పాండవుల ఇంట అక్షయ పాత్రలోని ఒక్క మెతుకును నోట్లో వేసుకోగానే, దుర్వాస మునితో సహా వేలాదిమంది రుషుల ఆకలి తీరి భుక్తాయాసంతో వెనుతిరిగారు. దేవాలయాల్లో ప్రతిష్టించిన ప్రతిమలు కూడా అంతే శక్తిమంతమైనవి. మన మహర్షులు దివ్యదృష్టితో, లోకకల్యాణార్థం ఈ అభిషేకాలను, యజ్ఞయాగాది సంప్రదాయాలను ప్రవేశ పెట్టారు. వీటిలో ఎంతో పరమార్థం ఉంది. ప్రత్యక్షంగా దానధర్మాలు, పుణ్యకార్యాలు ఎంత విశేషమైనవో, పారమార్థిక కోణంలో ఆలోచిస్తే ఆలయాల్లోని ఈ ఆచారాలు కూడా అంతే విశేషమైనవి. అలా అని ఆలయాల వద్ద ఉన్న బీదసాదలను పట్టించుకోకుండా కేవలం పాలను, పండ్లను అభిషేకాలు, అర్పణలకే పరిమితం చేయమని మన సనాతన ధర్మం ఎన్నడూ చెప్పలేదు. దానధర్మాలు ఎంత పుణ్యాన్ని ఇస్తాయో.. అంతరార్థం తెలుసుకుని ఆచరిస్తే అభిషేకాలూ అంతే ఫలితాన్నిస్తాయి.
45
You Might Also Like
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
16
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
30
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...
అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు
21
ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్...
సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్
27
సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం...
ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
27
తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి...