49
భారత నౌకాదళ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌక విశాఖ సాగరతీరంలో దర్శనమివ్వనుంది. అయితే ఇది నిజమైన నౌక కాదు. దాని నమూనా. ఐఎన్ఎస్ విరాట్ను సాగరతీరంలో మ్యూజియంగా తీర్చిదిద్దాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. ఆ లోటును పూడ్చేందుకు విరాట్ నమూనాను విక్టరీ ఎట్ సీ వద్ద సిద్ధం చేస్తున్నారు. దీనిని సందర్శకులు దూరం నుంచి స్పష్టంగా చూసేందుకు.. చుట్టూ పెద్ద అద్దాలను అమర్చారు. ఈ అద్భుతమైన నమూనాను తయారు చేయడానికి కళాకారులు శ్రమిస్తున్నారు. ఐఎన్ఎస్ విరాట్ భారత నౌకాదళానికి ఎంతో కాలం సేవ చేసింది. విరాట్ వైభవవంతమైన చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి.