తెలుగు భాషలో ఉన్న అవధాన ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది అద్భుతమైన విజ్ఞానంతో కూడిన మన ఆస్తి అని సహజ సాహితీ సంస్థ వ్యవస్థాపకుడు, కవి వడలి రాధాకృష్ణ అన్నారు.
బాపట్ల జిల్లా చీరాలలో సహజ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విద్యా కాలేజీలో అవధాని మానేపల్లి నాగకుమారశర్మ అష్టావధానం నిర్వహించారు. కోడూరి ఏకాంబరేశ్వరబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషకు గర్వకారణమని, తెలుగువారి సొత్తని తెలిపారు. అవధాని అంటే ఎంతో ఏకాగ్రత ఉన్న పండితుడనే అర్థం వస్తుందని వివరించారు. అవధానానికి విశేషమైన భాషా పాండిత్యం, సమయస్ఫూర్తి, కల్పనా చాతుర్యం, చమత్కారం సమపాళ్లలో ఉండాలని పేర్కొన్నారు. అనంతరం అవధాని మానేపల్లి నాగ కుమారశర్మకు చిలకపాటి కృష్ణమాచార్యులు, రంగనాయకమ్మ సాహితీ పురస్కారం–2024 ‘ధారణా ధురీణ’ బిరుదును ప్రదానం చేశారు. అనంతరం రావులకొల్లు వెంకట రంగాచార్యులు వేదాశీస్సులు అందజేశారు.
56
You Might Also Like
సిరిమాను చెట్టుకు బొట్టు
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు పెదతాడివాడలో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి బొట్టు పెట్టారు. పెదతాడివాడలోని మజ్జి అప్పారావు కల్లంలో గుర్తించిన...
బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ
18
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా...
హిందుత్వపై దాడి: టిటిడిలో హిందూ ముసుగులో క్రైస్తవుల నియామకాలు
లడ్డూ కల్తీ వివాదంతో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తిరుమలలో హిందువుల ముసుగులో అన్యమతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు టిటిడిలోని కీలక విభాగాల్లో...
‘మన సంస్కృతి వన సంస్కృతి అని చాటిచెప్పాలి’
21
వనాల సంస్కృతే మన దేశపు సంస్కృతి అని దేశవ్యాప్తంగా ఉన్న వనవాసీ తెగల వారందరూ ప్రపంచానికి చాటిచెప్పాలని అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ జాతీయ అధ్యక్షుడు...
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇక అనుమానాలు అక్కర్లేదు : టీటీడీ
18
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి...
తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా.. ఏఆర్ ఫుడ్స్కు కేంద్రం నోటీసులు
46
తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి...