News

సముద్రగర్భంలో రామసేతు వంతెన నిజమే

55views

భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కి.మీ. మేర ఉంది. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్‌ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.