పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన 32 వేల సంకీర్తనలలో కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే పరిష్కరించబడ్డాయని.. ఇంకా అపరిష్కృతంగా ఉన్న సంకీర్తనలను పరిష్కరించి జన బాహుళ్యంలోకి తీసుకురావాలని టీటీడీ ఈఓ జె.శ్యామలరావు అధికారులను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ పలు ప్రాజెక్టుల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనలలో ఎన్ని సంకీర్తనలు పరిష్కరించారు, ఎన్ని పరిష్కరించాలి, పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది..? తదితర అంశాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈఓకు వివరించారు. వీటిపై సిబ్బందికి ఈఓ పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో జేఈఓ గౌతమి, హెచ్డీపీపీ ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థ చార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.
45
You Might Also Like
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య
36
అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...
మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి
34
మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది....
దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా
50
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని...
భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – అదనపు ఈవో
28
టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల...
రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు
24
రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...
హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి
40
తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని...