చిత్తూరు జిల్లాలోని చారిత్రక చంద్రగిరి రాయలవారికోట సమీపంలో ప్రాచీనమైన రాతి కట్టడం బయటపడింది. రాయలవారికోటకు పడమర దిశలోని మండపానికి ఎడమ వైపున షేక్ ముజీబ్కు సుమారు రెండెకరాల మామిడితోట తమ వంశపారంపర్యగా సంక్రమిస్తోంది. రైతు ముజీబ్ తోటలో ముళ్ల పొదళ్లు, ఎత్తుపళ్లాలను చదును చేసి కొత్తగా మామిడి మొక్కలు, కూరగాయల సాగుకు జేసీబీతో చదును చేస్తున్నారు. ఈ క్రమంలో తోటలోని ఈశాన్య దిక్కులో చిన్నపాటి గుట్టగా ఉన్న మట్టిదిబ్బను తొలగించి శుభ్రం చేస్తుండగా అతి ప్రాచీనమైన పెద్ద రాతిబండల కట్టడం బయటపడింది. విషయాన్ని రైతు రాయలవారికోట అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పురావస్తుశాఖ కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పెద్దపాటి బండలతో వరుస క్రమంలో నిర్మించిన పురాతన కట్టడాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంతం మినహాయించి తోటను చదును చేసుకోవాలని రైతుకు సూచించారు. ఈ కట్టడం 11వ శతాబ్దానికి సంబంధించినదిగా అధికారులు భావిస్తున్నారు. కట్టడం బయటపడంతో స్థానికులు, కోట సందర్శకులు, పర్యాటకులు ఫొటోలు తీసుకుంటున్నారు.
39
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
26
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
31
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
43
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
32
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...