36
కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరితీయాలని విశ్వహిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ డిమాండు చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ, బజ రంగ్దళ్ ప్రతినిధులు ఘటనలో మృతి చెందిన యాత్రికులకు నివాళి ఆర్పిం చారు. అనంతరం డీఆర్వో మధుసూదనరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విహెచ్పీ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, నగర అధ్యక్షుడు టీ.సీ.మద్దిలేటి, బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ మీనుగ రాజేష్, సాయిరామ్, రామకృష్ణ పాల్గొన్నారు.