ఎర్రకోటపై దాడి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఉగ్రవాది మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. అధికార వర్గాలు బుధవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. 2000 డిసెంబరు 22న ఎర్రకోట ఆవరణలోని 7 రాజ్పుతానా రైఫిల్స్ యూనిట్పై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో ముగ్గురు జవాన్లు మరణించారు. ఆ తర్వాత నాలుగు రోజులకు లష్కరే తాయిబా ఉగ్రవాది ఆరి్ఫను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 1999లో మరో ముగ్గురు ఉగ్రవాదులు అబూ షాద్, అబూ బిలాల్, అబూ హైదర్లతో కలిసి ఆరిఫ్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం అబూ షాద్, అబూ బిలాల్, అబూ హైదర్ వేర్వేరు ఎన్కౌంటర్లలో మరణించారు. 2005 అక్టోబరు 5న విచారణ కోర్టు ఆరి్ఫకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా విచారణ కోర్టు తీర్పును సమర్థిస్తూ 2011 ఆగస్టులో తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆరిఫ్ వేసిన రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. కాగా, ఈ ఏడాది మే 15న ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా, దానిని అదేనెల 27వ తేదీన రాష్ట్రపతి తిరస్కరించారు. మే 29న వెలువడిన రాష్ట్రపతి సెక్రటేరియట్ ఆదేశంలో ఈ మేరకు పేర్కొన్నట్టు అధికారులు బుధవారం వెల్లడించారు.
44
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
32
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
25
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
32
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
14
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
27
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
32
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...