జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన కశ్మీరీ పండితులు, ముస్లింలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే ఇరు వర్గాల ప్రజలు కలిసి హోమం చేశాయి. మూడు దశాబ్దాల తర్వాత బరారీ మౌజ్ ఆలయాన్ని తెరవడం పట్ల గ్రామంలోని వలసేతర పండితులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సమయంలో కాశ్మీరీ పండిట్ మాట్లాడుతూ.. “మేం ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్లిపోనట్లు భావిస్తున్నాం. మూడు దశాబ్దాల తర్వాత తమ ఆలయం తెరుచుకుందని, తమకు సంతోషంగా వుందన్నారు. మరో కశ్మీరీ పండిట్ బోధరాజ్ భట్ మాట్లాడుతూ.. ఆలయం తెరుచుకోబోతోందన్న విషయం తెలుసుకొని, తాను ఢిల్లీ నుంచి వచ్చానని, హోమం, పూజల్లో పాల్గొన్నానని, ఆనందంగా వుందన్నారు. 1990లో లోయ విడిచి వెళ్లానని, ఇప్పుడు తిరిగి వచ్చినట్లు తెలిపారు.
89
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
26
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
31
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
43
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
31
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...