News

దేవతా విగ్రహాల ధ్వంసం

56views

చిత్తూరుజిల్లా కుప్పంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన కుప్పం మండలం, వసనాడుగొల్లపల్లెలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, వసనాడుగొల్లపల్లి సమీపంలో వెలిసిన శ్రీ నాగులమ్మ దేవాలయంలో నాగులమ్మ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాలను పదునైన ఆయుధాలతో తొలగించారు. విగ్రహాల కింద తవ్వకాలు చేపట్టడంతో, గుప్త నిధుల కోసమేనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక స్థానికుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆ దిశగా విచారణ సాగిస్తున్నారు.