జమ్మూ నుంచి త్రికూట పర్వతాల్లోని మాతా వైష్ణవోదేవి క్షేత్రానికి జూన్ 18వ తేదీ నుంచి నేరుగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నట్లు ఎస్ఎంవీడీబీ ప్రకటించింది. భక్తులకు ఉత్తమ సేవలు అందించాలన్న ఉద్దేశంతో డైరెక్టుగా జమ్మూ నుంచి భవన్ వరకు హెలికాప్టర్ సర్వీసులను మొదలుపెట్టినట్లు వైష్ణవోదేవి బోర్డు సీఈవో అన్షుల్ గార్గ్ తెలిపారు. హెలికాప్టర్ సర్వీసు ప్యాకేజీ బుక్ చేసుకున్నవాళ్లకు బ్యాటరీ కార్ సేవ, ప్రత్యేక దర్శనం, ప్రసాదం, రోప్వే సేవలు కూడా కల్పించనున్నారు. వైష్ణవోదేవి బోర్డు వెబ్సైట్ ద్వారా హెలికాప్టర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఆలయం వద్ద ఉన్న పంచీ హెలిప్యాడ్లో ల్యాండైన తర్వాత భక్తులను నేరుగా భవన్కు తీసుకెళ్తారు. దర్శనం తర్వాత భైరన్ ఆలయానికి వెళ్లేందుకు కేబుల్ కారు టికెట్ను కూడా కల్పిస్తారు. ప్రస్తుతం కాట్రా, సంజిచాట్ నుంచి మాత్రమే వైష్ణవోదేవి ఆలయానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రయిసి జిల్లాలో ఉన్న వైష్ణవోదేవి ఆలయానికి ప్రతి ఏడాది కోటి మంది భక్తులు వరకు వస్తుంటారు.
51
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
49
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
29
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
37
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
31
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
49
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...