కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి. కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ కుమార్ ఉన్నారు. వీరిలో పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తొలిసారి ఎంపీలుగా గెలిచి.. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ వరుసగా రెండోసారి ఎంపీలుగా గెలిచారు. మోదీ 2.0 ప్రభుత్వంలో కిషన్ రెడ్డికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
65
You Might Also Like
అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు
ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్...
సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్
సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం...
ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
15
తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి...
జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
13
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మతల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడలోని...
స్మార్తంతోనే సమాజ శోభితం
14
స్మార్తంలోని 16 కర్మల ద్వారానే సమాజం నిత్య శోభితమవుతుందని వేద ఘనాపాఠీలు ఉద్బోధించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న...
రాష్ట్ర దేవాదాయ శాఖలో భారీ బదిలీలు
23
రాష్ట్ర దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుమారు 15 మంది డిప్యూటీ కమీషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విజయవాడ కనకదుర్గ ఆలయపు డీసీ ఎం...