News

రామసేవకుల శోభాయాత్ర

94views

ఎన్టీఆర్ జిల్లా గంపల గూడెం శ్రీరామ సేవకుల ఆధ్వర్యంలో గంపల గూడెం సీతారామ చంద్రస్వామి ఆలయం నుంచి మేడూరు వీరాంజ నేయస్వామి ఆల యానికి శోభాయాత్ర నిర్వహిం చారు. 200 మంది వరకు భక్తులు జైహనుమాన్, జైశ్రీరామ్ నినాదాలతో 5 కి.మీ. పాదయాత్ర చేశారు. దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.పెనుగొలను సమీప మెట్టగుట్ట గజలక్ష్మీ సమేత శేషాచల శ్రీనివాసస్వామి ఆలయంలో శనివారం అర్చకులు శ్యామ సుందరాచార్యులు ఆధ్వర్యంలో మూలవిరా టకు పంచామృతాభిషేకాలు, విశేషార్చనలు, అలంకరణలు నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు స్వామివారిని దర్శించుకుని పాలపొంగళ్లతో మొక్కులు చెల్లించారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.