కేరళలో ఓ ఆలయం వద్ద జంతు బలి జరిగినట్లు గురువారం కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. తనతో పాటు సీఎం సిద్ధరామయ్య, మరికొంత మందిని టార్గెట్ చేస్తూ శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా జంతు బలి కూడా చేస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. ఆ ఆరోపణలను ఇవాళ కేరళ సర్కారు ఖండించింది. కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించినట్లుగా కేరళలోని ఆలయాల్లో ఎటువంటి జంతుబలి జరగలేదని ప్రభుత్వం పేర్కొన్నది. కన్నురూ జిల్లాలోని రాజరాజేశ్వరి ఆలయంలో జంత బలి జరిగినట్లు కర్నాటక డిప్యూటీ సీఎం ఆరోపించారని, కానీ దాంట్లో వాస్తవం లేదని కేరళ దేవాదాయశాఖ మంత్రి కే రాధాకృష్ణన్ తెలిపారు. శివకుమార్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని, దీని కోసం మలాబార్ దేవస్థానం బోర్డును సంప్రదించామని, ప్రాథమిక రిపోర్టు ప్రకారం అలాంటి ఘటనలు జరగలేదని తేలినట్లు మంత్రి వెల్లడించారు. దేవస్థానం బోర్డు కన్ఫర్మ్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే కర్నాటక డిప్యూటీ సీఎం ఎందుకు ఆ ఆరోపణలు చేశారో తేలాల్సి ఉందన్నారు. కేరళలోని ఇతర ఆలయాల్లో ఎక్కడైనా జంతు బలి జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 1968 నుంచి జంతుబలులు నిషేదించారని, శివకుమార్ ఆరోపణలు వంద శాతం అబద్ధమని మంత్రి పేర్కొన్నారు. అఘోరాలతో శత్రు భైరవి యాగం నిర్వహిస్తున్నట్లు శివకుమార్ ఆరోపించారు. కానీ ఆ యాగం ఎవరు చేయిస్తున్నారన్న విషయాన్ని ఆయన చెప్పలేదు.
53
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
26
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
31
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
43
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
31
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...