గాజాలోని రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడుల పట్ల పలువురు సెలబ్రిటీలు ‘కళ్లన్నీ రఫా వైపే’ అని పోస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సెలబ్రిటీల్లో కొందరు ఇప్పటికే పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఇదే కోవలో భారత క్రికెటర్ రాహుల్ తెవాటియా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా అతడు పాకిస్థాన్లోని హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల అంశాన్ని లేవనెత్తాడు. ‘అందరి దృష్టి పాకిస్థాన్లోని హిందువులపై ఉంది’ అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెవాటియా పెట్టాడు. ‘All Eyes on Hindus in Pakistan’ అంటూ పెట్టిన అతని ఇన్స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.అంతకుముందు సెలబ్రిటీలంతా ‘అందరి కళ్లు రఫాపైనే’ అని ట్రెండ్ చేశారు. అందుకు కౌంటర్గా తెవాటియా ఈ పోస్టు పెట్టారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.