దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునే యాత్రికుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ x జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సిటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 22న సికింద్రాబాద్లో బయలుదేరే ఈ పర్యాటక రైలు అరుణాచలం, కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించి జూన్ 30న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి. సికింద్రాబాద్ లో బయలుదేరే ఈ ప్రత్యేక రైలుకు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో యాత్రికులు ఎక్కిదిగేందుకు అవకాశం కల్పించారు. ఆసక్తి కలిగిన యాత్రికులు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లేదా విజయవాడలోని ఐఆర్సీటీసీ కార్యాలయం 9281495848, 8287932312 నెంబర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.
88
You Might Also Like
‘కంబోడియా’ ఉచ్చు నుంచి 60 మంది భారతీయులకు విముక్తి
23
కంబోడియాలో స్కాం కార్యకలాపాల్లో చిక్కుకున్న 60 మంది భారతీయులకు విముక్తి లభించింది. వేరే ఉద్యోగాల కోసం వెళ్లి ఏజెంట్ల చేతికి చిక్కిన వీరిని మే 20న కంబోడియాలోని...
రేపటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
28
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 12వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో...
విజయవాడలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
22
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడు నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కానున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు...
ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి
32
ఆలయాల జీర్ణోర్ధరణకు అన్ని విధాల కృషి చేస్తామని వైయస్సార్, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్ అన్నారు.అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని హసనాపురం గ్రామంలో...
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
28
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు...
‘మోమిడి’కి జాతీయ ఉత్తమ అవార్డు
35
చిత్తూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్లో భాగంగా ‘పేదరికం లేని జీవనోపాధి మెరుగ్గా ఉన్న పంచాయతీ, ఆరోగ్యకరమైన,...