News

కంటైనర్లో ఊపిరాడక 15 ఆవులు మృతి

54views

అక్రమంగా గోవులను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆవులను కంటైనర్లో తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. తెలంగాణ సూర్యాపేట నుంచి ఆంధ్రా వైపు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెకోపోస్టు వద్ద కంటైనర్ పట్టుబడింది. కంటైనర్ను పోలీసులు తనిఖీ చేశారు. కంటైనర్ లో మొత్తం 26 ఆవులు ఉన్నట్టు గుర్తిం చారు. అందులో ఊపిరాడక 15 ఆవులు మృతి చెందినట్టు నిర్ధారించారు. తొమ్మిది ఆవులను నల్గొండ గోశాలకు తరలించారు. ఆవులను ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా గురజాలకు చెందినవిగా గుర్తించారు. రెండు ఆవులకు కాళ్లు విరగడంతో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ఆవులకు వెటర్నరీ డాక్టర్స్ పోస్టుమార్టం నిర్వహించారు. ఆవులను తరలిస్తున్న నలుగురు తమిళనాడు వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.