112
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కాజా టోల్గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణాని మంగళగిరి రూరల్ పోలీసులు అడ్డుకున్నారు.గోవుల అక్రమ రవాణా పోలీసులకు సమాచారం రావడంతో ఆవులను అక్రమ రవాణా చేస్తున్న కంటైనర్ ను అదుపులో తీసుకోగా 60 కి పైగా ఆవులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆవుల అక్రమ రవాణా పై విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ వంటి హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.