News

వైభవంగా నమ్మాళ్వార్ శాత్తుమొర

107views

తిరుపతి కపిల తీర్థం సమీపంలోని ఆళ్వార్ తీర్థములో వేంచేసి ఉన్న నమ్మాళ్వార్ సన్నిధిలో శుక్రవారం నమ్మాళ్వార్ శాత్తుమొర ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం 1500 సంవత్సరముల పురాతనమైనది. భగవద్ రామానుజాచార్యులు మొదటిసారి తిరుపతికి వచ్చినప్పుడు మొట్ట మొదట ఈ ఆలయాన్ని సందర్శించి, ఒక సంవత్సరం పాటు ఈ ఆలయంలో వేంచేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అలిపిరి పాదాల మండపం వద్ద రామాయణ కాలక్షేపం, అధ్యయనం చేసేవారని అర్చకులు తెలిపారు. ఈ ఆలయంలో నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, భగవద్ రామానుజులు, తిరువరంగత్తు అముదనార్ విగ్రహాలను ప్రతిష్టించి ఉన్నారు.