82
భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ ఆధ్వర్యంలో నేపాల్–ముక్తినాథ్– దివ్యదేశం యాత్ర జూన్ 7 నుంచి 19 వరకు జరుగుతుందని ప్రొడక్ట్ డైరెక్టర్ విఘ్నేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నైమిషారణ్యం, ఫోక్రా, జామ్సోమ్, ముక్తినాథ్, మనకామన, ఖాట్మాండ్, పశుపతినాథ్, అయోధ్యలను ఈ యాత్ర సందర్భంగా సందర్శించవచ్చన్నారు. జూన్ 7న చెన్నైలో రైలు బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిరియాలగూడ, సికింద్రాబాద్, కాజీపేట్ స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఏసీ సెకండ్ క్లాస్ రూ. 59,950,థర్డ్క్లాస్ రూ.54,900, స్లీపర్ క్లాస్ రూ.45,900లుగా నిర్ణయించడం జరిగిందన్నారు. వివరాలకు 9355021516, 9384803557 నంబర్లలో సంప్రదించాలని కోరారు.