దుర్గమ్మ భక్తులకు సులభంగా వరాలిచ్చే తల్లి. భక్తులను తన కంటి రెప్పలా కాపాడుకునే ఆ తల్లి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత విన్నా తనివితీరదని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘శ్రీమాత వైభవం’ప్రవచనాన్ని చాగంటి కోటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. తొలుత ఆయనకు దేవస్థానం వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం చాగంటి మాట్లాడుతూ జగన్మాత దుర్గాదేవి వైభవాన్ని వివరించే అదృష్టం రావడం పూర్వజన్మ సుకృతం అన్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే దుర్గమ్మ అను గ్రహాన్ని పొందేందుకు భక్తులు తపన చెందడం అనాదిగా వస్తుందన్నారు. త్రేతాయుగం, ద్వాపర, కలియుగాల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజులు, మహారాజులు పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోందన్నారు. అటు వంటి గడ్డపై పుట్టిన మనం అదృష్టవంతులుగా భావించి మంచి మార్గంలో నడవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.
76
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
27
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
31
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
45
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
33
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...