News

వచ్చే నెల మొదటివారంలో సునీత రోదసి యాత్ర

108views

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వచ్చే నెల 1 నుంచి 5 మధ్య జరిగే అవకాశం ఉంది. బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్ వ్యోమనౌకలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవసహిత రోదసి యాత్ర. ఈ నెల 6న దీని ప్రయోగానికి ప్రయత్నించినప్పటికీ సాంకేతిక సమస్యతో అది నిలిచిపోయింది. స్టారైనర్ పనితీరును విశ్లేషించేందుకు ఇంజినీర్లు నిరంతరం కస రత్తు చేస్తున్నారు. వ్యోమనౌకలోని సర్వీసు మాడ్యూ ల్లో లో చిన్నపాటి హీలియం లీకేజీని గుర్తించడంతో అన్ని వ్యవస్థలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ వ్యోమనౌకలో సునీతతో పాటు బుచ్ విల్మార్ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. వీరు భూకక్ష్య లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు.