కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుడి సన్నిధి వేదఘోషతో పులకించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేదాలలో నిష్ణాతులైన పండితులు తమ వేదవిద్యను స్వామివారి పాదాలచెంత ఉంచి పునీతులయ్యారు. స్వామివారి దివ్యకల్యాణోత్సవాలలో భాగంగా పండిత సదస్యం అత్యంత ఘనంగా జరిగింది. నవవధూవరులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అనివేటి మండపం వద్దకు తోడ్కొని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై ఆశీనులు గావించి మరో వేదికపై క్షేత్రపాలకులు సీతారాములను ఉంచి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గణపతిపూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా పండితులంతా తమ పాండిత్యంతో మైమరిపింపచేశారు. అనంతరం రాష్ట్రం నలుమాలల నుంచి విచ్చేసిన సుమారు 100మంది పండితులను పూలమాలలు, దుశ్శాలువా కప్పి, విసినకర్రను అందజేసి నగదు పురస్కారాలను ఈవో రామచంద్రమోహన్, చైర్మన్ రోహిత్లు అందజేశారు. కార్యక్రమం అనంతరం పండితులంతా నవ దంపతుకు వేదాశీర్వచనాలు అందజేశారు.
93
You Might Also Like
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
39
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
40
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....
రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.
38
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్…...
ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు: ఫరూక్ అబ్దుల్లాపై అమిత్ షా విమర్శలు
33
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు...
ఫిష్ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర
52
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్మ్యాన్ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్ జిల్లాలోని కోసంబ- కిమ్...
జగన్ తాడేపల్లి నివాసం వద్ద యువ మోర్చా నిరసన
31
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు...