News

నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు…..భారత్ లో విధ్వంసానికి పన్నాగం

79views

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అదుపులోకి తీసుకు న్నారు. కొలంబో నుంచి చెన్నై మీదుగా ఆదివారం రాత్రి అహ్మదాబాద్ చేరుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. వారి సెల్ ఫోన్లోని వివరాల ఆధారంగా ఓ ప్రదేశంలో దాచిన పాకిస్థాన్ తయారీ పిస్తోళ్లు, 20 కాట రిజ్లను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ లోని ఐసిస్ నాయకుడు అబూ బాకర్ అల్ బాగ్దాదీ నేతృత్వంలో పనిచేస్తున్న వీరు.. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపా లకు వ్యూహరచన చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరికి పాకిస్థాన్ వీసా కూడా ఉందడం గమనార్హం. వారిపై ఉపా తదితర చట్టాల కింద కేసులు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు.