116
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై స్వామి, అమ్మవార్లను, ఆ పక్కనే పెళ్లిపెద్దలు సీతారాముల వారిని ఆసీనులను చేసి కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలమంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు.