
వినాయక్ దామోదర్ సావర్కర్..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు..
ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్.
దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగత పరిచారు.
1857 స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ వారు భారత్ను స్వాధీనం చేసుకొని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వినాయక్ దామోదర్ సావర్కర్ జన్మించే నాటికి దేశం కఠోర బానిసత్వంలో మగ్గుతూ అష్టకష్టాలు పడుతోంది. దీనికితోడు సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలలో మునిగిపోయిన భారత సమాజాన్ని సంస్కరించేందు ఎన్నో సాంఘిక, మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభ మయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్ స్వాతంత్య్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. అదే సమయంలో ఆయన సాహితీవేత్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సేవలు అందించారు.
దేశం కోసమే జీవితం
వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితాన్ని రెండు భాగాలుగా ఆవిష్కరించవచ్చు. ఇందులో ముందుగా ప్రథమార్ధాన్ని చూద్దాం. 1883 మే 28న నాసిక్ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక్ దామోదర్ సావర్కర్. సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణ రావు సావర్కర్. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు.
ఆనాటి బ్రిటిష్ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సావర్కర్ సోదరులు తమ కుల దేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆశయ సాధన కోసం ‘రాష్ట్ర భక్త సమూహ్, మిత్ర మేళా, అభినవ భారత్’ అనే సంస్థలను స్థాపించారు.
పుణే పెర్గ్యుసన్ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్ దామోదర్ సావర్కర్ ‘బార్-ఎట్-లా’ చదువు కోసం 1906లో లండన్ బయలుదేరారు. న్యాయవిద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవ కారులతో కలిసి పని చేశారు. వారందరికీ సావర్కర్ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు.
సావర్కర్ లండన్లో ఉన్న సమయంలోనే అన్న గణేష్ సావర్కర్కు బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్ న్యాయ విద్య పూర్తి చేసినా, బ్రిటిష్ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్ ఎట్ లా పట్టా నిరాకరించారు. సావర్కర్ కుడి భుజం మదన్లాల్ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్ విల్లేని హతమార్చాడు. గణేష్ సావర్కర్కు శిక్ష విధించిన జాక్సన్ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్ నుంచి లండన్ వచ్చిన సావర్కర్ను రైల్వేస్టేషన్లో బంధించారు. స్టీమర్లో భారత్కు తీసుకొస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు.

వినాయక్ దామోదర్ సావర్కర్కు న్యాయస్థానం అండమాన్ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్. అంతేకాదు ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.
జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత బేధాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా 1923 డిసెంబర్లో సావర్కర్ను అండమాన్ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్ ప్రభుత్వం వీర సావర్కర్ను పూర్తిగా విడుదల చేసింది.
సంఘ సంస్కర్తగా పునర్నిర్మాణం
సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతోంది. సమాజంలోని ఈ అసమానతలు రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్. సావర్కర్ తన గ్రామంలోని హరిజనుడి ఇంట టీ తాగడం సనాతన ఆచార పరాయణులకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్. హిందువులు అంతా బంధువులేనని చాటి చెప్పారు.

వినాయక్ దామోదర్ సావర్కర్కు న్యాయస్థానం అండమాన్ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్. అంతేకాదు ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.
జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత బేధాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా 1923 డిసెంబర్లో సావర్కర్ను అండమాన్ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్ ప్రభుత్వం వీర సావర్కర్ను పూర్తిగా విడుదల చేసింది.
సంఘ సంస్కర్తగా పునర్నిర్మాణం
సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతోంది. సమాజంలోని ఈ అసమానతలు రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్. సావర్కర్ తన గ్రామంలోని హరిజనుడి ఇంట టీ తాగడం సనాతన ఆచార పరాయణులకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్. హిందువులు అంతా బంధువులేనని చాటి చెప్పారు.

వీర సావర్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు
– 1883 మే 28 – మహరాష్ట్ర నాసిక్ జిల్లా భాగూరు గ్రామంలో రాత్రి 10 గంటలకు వినాయక్ దామోదర్ సావర్కర్ జననం
– 1892 – తల్లి రాధాబాయి మరణం
– 1898 – దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్ని సమర్పిస్తానని కుల దేవత అష్టభుజాదేవి ముందు ప్రతిన
– 1899 సెప్టెంబర్ – తండ్రి దామోదర్ పంత్ మరణం, ‘రాష్ట్రభక్త సమూహ్’ రహస్య సంస్థ ప్రారంభం
– 1900 – ‘మిత్రమేళా’ అనే రహస్య సంస్థ ప్రారంభం
– 1901 మార్చి – యమునా బాయితో వివాహం’
– 1902 – పూణే ఫెర్గ్యూసన్ కాలేజీలో చేరిక
– 1904 మే – ‘మిత్ర మేళా’ పేరు ‘అభినవ్ భారత్’ గా మార్పు
– 1905 డిసెంబర్ – బిఎ ఉత్తీర్ణత
– 1906 జూన్ 9 – ‘బార్ ఎట్ లా’ చదువు కోసం ఇంగ్లాడ్ చేరిక
– 1908 మార్చి – ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రచన
– 1909 – సావర్కర్ కుమారుడు ప్రభాకర్ మరణం, అన్న గణేష్ సావర్కర్కు అండమాన్ జైలు శిక్ష. బ్రిటిష్ రాణికి విధేయత చూపనందుకు సావర్కర్కు బార్-ఎట్-లా డిగ్రీ నిరాకరణ
– 1909 – లండన్లో కర్జన్ వైలీని హతమార్చిన సావర్కర్ అనుచరుడు మదన్లాల్ ధింగ్రా
– 1910 మార్చి 13 – లండన్ రైల్వే స్టేషన్లో సావర్కర్ అరెస్టు
– 1910 జూలై 18 – స్టీమర్లో భారత్ తీసుకువస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే యత్నం
– 1910 డిసెంబర్ 24 – సావర్కర్కు అండమాన్ యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
– 1911 జనవరి 31 – సావర్కర్కు రెండో యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
– 1911 జూలై 4 – అండమాన్ కారాగార శిక్ష ప్రారంభం
– 1918 – సావర్కర్కు తీవ్ర అనారోగ్యం
– 1922 – ‘హిందుత్వ’ గ్రంధ రచన
– 1923 డిసెంబర్ – ఎరవాడ జైలుకు సావర్కర్ బదిలీ
– 1924 – రాజకీయాల్లో పాల్గొనరాదు, రత్నగిరి వదిలి పోరాదు అనే షరతులతో సావర్కర్ విడుదల
– 1924 – ‘గోమంతక్’ గ్రంథ రచన
– 1925 – కుమార్తె ప్రభ జననం, అస్పశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమం
– 1927 – రత్నగిరిలో మహాత్మా గాంధీజీతో సమావేశం, అండమాన్ అనుభవాలపై పుస్తక రచన
– 1931 ఫిబ్రవరి – రత్నగిరిలో పతిత పావన మందిర ప్రారంభం
– 1937 – సావర్కర్పై ఆంక్షల ఎత్తివేత, పూర్తిస్థాయి విడుదల.. హిందూ మహాసభ అధ్యక్షునిగా ఎన్నిక
– 1938 అక్టోబర్ – హైదరాబాద్ విముక్తి సత్యాగ్రహం
– 1943 – సావర్కర్ షష్టిపూర్తి
– 1945 మార్చి – సావర్కర్ అన్న గణేష్ సావర్కర్ మరణం
– 1946 ఏప్రిల్ – సావర్కర్ సాహిత్యంపై నిషేధం ఎత్తివేత
– 1948 ఫిబ్రవరి 5 – గాంధీ హత్య కేసులో అరెస్టు
– 1949 మే 10 – నిర్దోషిగా విడుదల
– 1949 అక్టోబర్ – తమ్ముడు నారాయణరావు మరణం
– 1958 – సావర్కర్కు 75 ఏళ్ల సందర్భంగా అమతోత్సవం
– 1959 – పూణె విశ్వ విద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్
– 1963 – ‘భారతీయ ఇతిహాస్ కే ఛే స్వర్ణిమ పష్ట్’ పుస్తక ప్రచురణ
– 1963 మే – సావర్కర్ భార్య యమునాబాయి మరణం
– 1966 ఫిబ్రవరి 26 – వీర సావర్కర్ శాశ్వత నిష్క్రమణ
(మే 28 సావర్కర్ జయంతి ప్రత్యేకం)
Source: జాగృతి





