News

భారత అమెరికన్లకు ప్రతిష్ఠాత్మక అవార్డులు.. బైడెన్​ చేతుల మీదుగా..

306views

శాస్త్ర, సాంకేతిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి అమెరికా ప్రభుత్వం అందించే అవార్డులకు ఇద్దరు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అశోక్​ గాడ్గిల్​, శుభ్ర సురేశ్​కు నేషనల్ మెడల్​ ఫర్ టెక్నాలజీ మెడల్​ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం అందజేశారు.

అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం బర్కెలీ యూనివర్సిటీలో ఎమిరెట్స్ ప్రోఫెసర్​గా సివిల్, ఇంజనీరింగ్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తుండగా.. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో స్కూల్​ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో శుభ్ర సురేశ్​ విధులు నిర్వర్తిస్తున్నారు.