
730views
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన ప్రాచీన శ్రీకాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ ‘విజయ్ దివస్’ వేడుకల్లో రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఈ మందిర పునర్నిర్మాణానికి భారత్ సాయం చేసింది.