Articles

ArticlesNews

పోగొట్టుకున్న చోటే…

ఒక వృద్దుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతున్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి 'తాతా, ఎం. వెతుకుతున్నావు?' అని అడిగాడు బాబూ, నా అయిదు రూపాయల నాణెం పడిపోయింది.ఎంత వెతికినా దొరకడం లేదు' అన్నాడు.'తాత ఎక్కడ పడింది"...
ArticlesNews

తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకుడు కొమర్రాజు లక్ష్మణరావు

(మే 18 - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి) తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగులో చరిత్ర పరిశోధనలు, విజ్ఞాన రచనలు చేయడానికి తొలి అడుగులు వేసినవారు. నిద్రాణమై ఉన్న తెలుగు జాతిని మేల్కొలిపిన మహనీయుల్లో ఎన్నదగిన వారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు క్రీ.శ. 1876 మే 18న ఉమ్మడి కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు.విద్యార్థిగా ఉన్నపుడు 'సమాచార్','వివిధ విజ్ఞాన్ విస్తార్' వంటి మరాఠి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. 'కేసరి', 'మహారాష్ట్ర' వంటి పత్రికలకు విరివిగా వ్యాసాలు రాశారు. అనేక చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగులో 'జనరంజని' పత్రిక స్వయంగా నడిపించారు. విజయవాడలో స్త్రీ విద్యావ్యాప్తి 'తెలుగు జనానా' పత్రికలో సోదరి బండారు అచ్చమాంబతో కలిసి అనేక రచనలు చేశారు. హైదరాబాదులోని 'శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం' స్థాపించడంలోనూ;...
ArticlesNews

మన సత్తాపై ‘అణు’మానాలు తీరిన రోజు

(మే18- పోఖ్రాన్‌-1 పరీక్షకు 50 ఏళ్లు) భారత్‌ అణు బాంబు తయారుచేస్తే గడ్డి తిని.. అవసరమైతే పస్తులుండైనా మేమూ అణు బాంబును తయారుచేస్తాం. అంటూ భారత్‌ పరీక్షలు నిర్వహించడానికి 9 ఏళ్ల ముందే ప్రకటించిన పాక్‌.. ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. 1974 మే 18 భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ప్రపంచ యవనికపై మన దేశం సాంకేతిక సత్తా చాటిన రోజు. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపిన రోజు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే రోజు భారత్‌ తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్‌ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంలేని దేశం అణు పరీక్ష...
ArticlesNews

18 నుంచి సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు

సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా అన్నవరం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ పావన పంపా నదీ తీరాన రత్నగిరిపై వెలసిన భక్తవరదుడు.. శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి....
ArticlesNews

వియత్నాం రాజుకి స్ఫూర్తినిచ్చిన మహారాణా ప్రతాప్

ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి దాని సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు. మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదని అన్నాడు. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి వియత్నాం...
ArticlesNews

900 ఏళ్ల చరిత్ర.. తిరుపతి గంగమ్మ జాతర విశిష్టత ఇదే..

రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరల్లో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది. నిన్న అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర...
ArticlesNews

ప్రశాంతతకు మార్గం

సాధకుల భావనలను బట్టి భక్తి పలువిధాలు. భేద దృష్టి, క్రోధం, హింస, దంభం, అసూయలుంటే అది తామస భక్తి. విషయ వాంఛలు, కీర్తి, ఐశ్వర్యాలపై అభిలాషతో సేవిస్తే రాజస భక్తి. పాపక్షయం కోసం కర్మఫలాలను భగవంతుడికి అర్పించటమే కర్తవ్యమని భావిస్తూ, ప్రతిఫలాపేక్ష లేక సేవిస్తే సాత్త్విక భక్తి. పరవశంతో ప్రపంచాన్ని మర్చిపోయి పరమాత్మ యందు మనసు లయమైతే.. అది నిర్గుణ భక్తి. అలాంటి భక్తి యోగాన్ని సాధించిన వారు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య మోక్షాలను కోరరు. దేవుడి సేవలో నిమగ్నమై, ఏమివ్వబోయినా తిరస్కరిస్తే.. ఆత్యంతిక భక్తి. ఇదే పరమోత్తమ పురుషార్థం. ఈ యోగంతో జీవులు త్రిగుణాతీతులై భగవత్స్వరూపంగా భాసిస్తారు. ఇదే సర్వశ్రేష్ఠ భక్తియోగం. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేక.. నిష్కామభావంతో స్వధర్మాలను ఆచరించేవారు శ్రేష్ఠులు. విద్యుక్తకర్మఫలాలు భగవదర్పణం చేసేవారు వారి కంటే గొప్పవారు. దేహాభిమానం...
ArticlesNews

అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగించిన వారు శ్రీ విద్యారణ్యులు

( మే 14 - విద్యారణ్యుల జయంతి ) ఏకశిలానగరం (నేటి వరంగల్‌) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం.శృంగేరి పీఠాధిపతి వీరికి సన్యాసదీక్ష ఇచ్చారు. మాధవులకు విద్యారణ్యులని ఆశ్రమనామం ఇచ్చారు. ఒకసారి శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ శిష్యులను వారి వారి జీవిత లక్ష్యాలను చెప్పమన్నారు. అందరూ రకరకాలుగా చెప్పారు. విద్యారణ్యులు దేశ, ధర్మాలను రక్షించడమే తన లక్ష్యమని, దానికోసమే తన జీవితాన్ని సమర్పిస్తానని చెప్పారు.విద్యారణ్యులు కాశీయాత్ర ముగించుకుని, హంపి చేరి తీవ్ర తపస్సు చేసారు. మొగలాయి దండయాత్రలు, ఆగడాలతో దక్షిణ భారతదేశం అతలాకుతలమయింది. శ్రీరంగం, మధుర మొదలయిన ప్రధాన దేవాలయాలతో సహా అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అనేకమంది హిందువులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు.ఈ పరిస్థితులు...
ArticlesNews

మన ప్రయాణం జ్ఞానం వైపు…

జ్ఞానం, విజ్ఞానం అనే మాటలు పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం జీవాత్మలు అల్పజ్ఞానం కలిగినవని, పరమాత్మ...
ArticlesNews

బలగాల విభాగంలోనూ భగవానుడి ధర్మనిరతి

కురుక్షేత్రం సంగ్రామంలో తన సాయం కోరిన దుర్యోధన అర్జునులకు బలగాన్ని పంచడంలో శ్రీకృష్ణుడు అనుసరించిన విధానాన్ని ఎవరెంత వ్యాఖ్యానించినా ఆ చర్య వెనుక ధర్మకాంక్షే దాగుంది. 'మహాసంధి' సూత్రాలననుసరించి పూర్ణసైన్యాన్ని దుర్యోధనుడికి ఇచ్చాడు. తాను పాండవులవైపునకు. ఈ సైన్యం కౌరవ పక్షంలో...
1 211 212 213 214 215 334
Page 213 of 334