
లడఖ్లో ఒక యువ బౌద్ధ మహిళను అపహరించి బలవంతంగా మతమార్పిడికి గురిచేశారు. దాంతో ఆ మహిళను రక్షించడానికి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, మత సమారస్యాన్ని కాపాడడానికి కేంద్రపాలిత ప్రాంతంలో కఠినమైన మతమార్పిడి నిరోధక చట్టాలని అమలు చేయాలంటూ జాంస్కార్ బౌద్ధ సంఘం(ZBA), స్థానిక అధికారులకు లేఖ రాసింది.
జాంస్కర్ సబ్-డివిజన్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్కు రాసిన ఈ లేఖలో, చాలా రోజులుగా తప్పిపోయిన జాంస్కర్కు చెందిన బౌద్ధ బాలిక స్టాన్జిన్ యాంగ్డోల్ కేసును వివరించారు. జెడ్బీఏ ప్రకారం, ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు , బంధువులతోకలిసి సమగ్ర శోధనలు ,విచారణలు చేసినా ఎటువంటి ఆధారాలు లభించలేదు, దీని వలన ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను తప్పుగా నిర్బంధించాలనే ఉద్దేశ్యంతో తెలియని వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారని వారు అనుమానిస్తున్నారు.
“బౌద్ధ సమాజానికి చెందిన బాలికలను మోసపూరితంగా మరొక మతంలోకి మార్చడానికి వివాహాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఈలేఖలో జెడ్పీఏ ఆరోపించింది. ప్రజా ఆందోళన కలిగించే ఈ విషయంపై మీ దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా ఈ లేఖ రాస్తున్నామంటూ పేర్కొంది. అనేక సందర్భాల్లో, వివాహాలు బౌద్ధ బాలికల స్వేచ్ఛా, స్వచ్ఛంద, సమాచార సమ్మతితో కాకుండా, మోసం, బలవంతం, ప్రేరేపణ లేదా తప్పుడు ప్రాతినిధ్యం ద్వారా ముందుగా, మతమార్పిడితో జరుగుతున్నాయని నమ్మడానికి బలమైన సహేతుకమైన కారణాలు ఉన్నాయి” అని ఆ సంస్థ లేఖలో పేర్కొంది.
“ఈ సంఘటనలు స్థిరమైన ,ముందస్తు ప్రణాళికతో కూడిన నమూనాను అనుసరిస్తున్నాయని, ఒక నిర్దిష్ట సమాజానికి చెందిన బాలికల మతపరమైన గుర్తింపును మార్చే లక్ష్యంతో వ్యవస్థీకృత కుట్ర జరిగిందనే సహేతుకమైన భయాన్ని పెంచుతున్నాయని తాము నమ్మడానికి బలమైన కారణం ఉంది” అని వారు ఈ లేఖలో పేర్కొన్నారు.
బౌద్ధ బాలికలు ముస్లిం పురుషులతో వివాహాలు చేసుకుంటే, పరస్పర అంగీకారంతో, మతపరమైన ఒత్తిడి లేకుండా వివాహాలు జరిగితే, వాటిని ప్రత్యేక వివాహ చట్టం కింద జరపవచ్చని జంస్కార్ బౌద్ధ సంఘం పేర్కొంది. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ అమ్మాయి మతం మాత్రమే మారుతుందని, పురుషులు ఎప్పుడూ మతం మార్చుకోరని సంస్థ పేర్కొంది. “ఈ ఏకపక్ష మరియు పునరావృత నమూనా అటువంటి మతమార్పిడుల స్వచ్ఛందత, చట్టబద్ధత మరియు నిజాయితీకి సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతుంది. అందువల్ల ఈ సమస్య యొక్క తీవ్రత మరియు సున్నితత్వం సమర్థ అధికారులచే తక్షణ పరిశీలనకు అర్హమైనది” అని లేఖ లో పేర్కొన్నారు.
ముస్లింలు లవ్ జిహాద్ చేయకుండా ఉండేందుకు వారిని చైతన్యపరచాలని, అది మతపరమైన అశాంతికి దారితీస్తుందని అధికారులు, ముస్లిం సమాజ నాయకులు, ఇతరులను కూడా ఈ లేఖలో కోరుకుంది. బౌద్ధ సమాజానికి చెందిన యువతులను మత మార్పిడి కోసం నిరంతరం వివాహంలోకి రప్పిస్తున్నారని, ఇది ఈ ప్రాంత మత సామరస్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
స్టాన్జిన్ యాంగ్డోల్ ను ఆమె కుటుంబానికి సురక్షితంగా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, వివాహం లేదా ప్రలోభాల ద్వారా బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడులు చేసేవారిని శిక్షించాలని ZBA పిలుపునిచ్చింది. లడఖ్ UTలో కఠినమైన “మార్పిడి నిరోధక చట్టం లేదా లవ్ జిహాద్ నిరోధక చట్టం”ను అమలు చేయాలని కూడా ఇది ప్రత్యేకంగా అభ్యర్థించింది, ఇటువంటి చర్యలు శాంతిని కాపాడుకోవడానికి సహాయపడతాయని వాదించింది.
భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 లోని సెక్షన్లు 138, 127, 318, 69, 87 మరియు ఇతర సంబంధిత నిబంధనల కింద నిందితులపై వెంటనే ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేయాలని కూడా లేఖ లో పేర్కొన్నారు. ZBA అధ్యక్షుడు త్సెరింగ్ డోర్జయ్ సంతకం చేసిన లేఖ కాపీలను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్, UT లడఖ్ పరిపాలనతో సహా ఉన్నత స్థాయి అధికారులకు పంపారు.




