News

యమునా ఎక్స్ ప్రెస్ వేపై 108 అడుగుల శ్రీకృష్ణ విగ్రహం ఆవిష్కరణ

272views

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై 108 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఇటీవల ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్, మధుర పార్లమెంటు సభ్యురాలు, బాలీవుడ్ నటి హేమమాలిని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో -ఎత్తైన విగ్రహం. గౌర్స్ గ్రూప్ అభివృద్ధి చేసిన 250 ఎకరాల సువిశాల టౌన్షిప్ గౌర్ యమునా సిటీలో ఈ అద్భుతమైన విగ్రహం ఉంది. యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించే పర్యాటకులు, భక్తులకు ఈ విగ్రహం ప్రధాన ఆకర్షణగా మారుతుందని జైవీర్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 08 అడుగుల విగ్రహం శ్రీకృష్ణుని దైవిక కృప మరియు భక్తికి అద్భుతమైన నివాళిగా నిలుస్తుందని అన్నారు.”ఈ నిర్మాణం విశ్వాసం యొక్క మైలురాయిగా మారుతుంది, కృష్ణ జన్మభూమి, మధురకు వెళ్ళే యాత్రికులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి మరియు ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నాము” అని ఆయన అన్నారు.

మధురలోని కృష్ణ జన్మభూమికి యాత్రికులు, పర్యాటకులను ఆకర్షించే విశ్వాన చిహ్నంగా ఈ విగ్రహం ప్రాముఖ్యతను గౌర్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ వివరించారు. 165.5 కిలోమీటర్ల పొడవు, 6 వరుసల వెడల్పుతో రూపొందించిన యమునా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో అభివృద్ధి, పెట్టుబడులకు కీలకంగా మారింది.