News

శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజల్లో పాల్గొన్న రష్యన్ భక్తులు

339views

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి క్షేత్రంలో రష్యన్ భక్తులు రాహు కేతు పూజలు నిర్వహించారు. 25 మంది రష్యన్లు ఈ క్షేత్రానికి వచ్చారు. ఓం నమ:శివాయ నామస్మరణతో తన్మయత్వం పొందారు. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం శ్రీకాళహస్తి క్షేత్రంలో పూజలు అందుకుంటోంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. ఈ ఆలయ నిర్మాణ శైలి, అద్భుతమైన భారతీయ వాస్తు కళకు రష్యన్లు ముగ్ధులయ్యారు.